Share News

రక్షణ చట్టం అమలు చేయాలని..

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:38 PM

న్యాయవాదులపై దాడుల ను అరికట్టేందుకు రక్షణ చట్టం అమలు చేయాలని ఆమదాలవలస, సోంపేట బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాం డ్‌ చేశారు.

రక్షణ చట్టం అమలు చేయాలని..
ఆమదాలవలస: విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

న్యాయవాదులు విధుల బహిష్కరణ

ఆమదాలవలస/సోంపేట, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదులపై దాడుల ను అరికట్టేందుకు రక్షణ చట్టం అమలు చేయాలని ఆమదాలవలస, సోంపేట బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాం డ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆమ దాలవలస, సోంపేట కోర్టుల విధులను బహిష్కరించి వేర్వేరుగా నిరసన తెలి పారు. తెలంగాణతో పాటు ఏడు రాష్ర్టాల్లో ఈ చట్టం అమలులో ఉందని, మన రాష్ట్రం లోనూ వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆమదాలవలస, సోంపేట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కణితి విజయలక్ష్మి, కుణితి వెంకటేశ్వరరావు, న్యాయవాదులు సాధు ధనుంజయరావు, బి.మోహన్‌ రావు, బి.సీతారాం, శిలగాన భాస్కరావు, బొడ్డ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 11:38 PM