నీటమునిగిన పంట పొలాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:56 PM
జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల పంట పొలాలు నీటిముని గాయి. వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. వర్షాలకు రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల పంట పొలాలు నీటిముని గాయి. వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకూలాయి. వర్షాలకు రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
ఫ ఎల్.ఎన్.పేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పెద్దకోట, లక్ష్మీనర్సుపేట, కోవిలాం, రావిచెంద్రి, ధనుకువాడ, దబ్బపాడు, చిట్టిమండలం, తురకపేట, దబ్బపేట పంట పొలాలు నీటిమునిగాయి. చెరువులు, కాలువలు నిండడంతో దిగువప్రాంతాలకు నీరు ప్రవహిస్తోంది. శనివారం వేకువజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోని పంటపొలాల్లో నీరుచేరింది. లక్ష్మీనర్సుపేట- పెద్దకోట రోడ్డు మీద నుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఫనరసన్నపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిక్కాలవలసలో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఒక్కసారిగా గాలులువీయడంతో రెండు స్తంభాలు నెలకొరిగాయని, ఆ సమయంలో వీధుల్లో ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.
ఫసంతబొమ్మాళి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని డీపీఎన్రోడ్డులో పాలేశ్వరస్వామి ఆలయం సమీపంలో వర్షానికి నీరు చేరడంతో చెరువును తలపి స్తోంది. తంపరలో అక్రమంగా రొయ్యిల చెరువుల ఏర్పాటుతో వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.