Share News

విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించాలి

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:50 PM

విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించా లని డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపా యాలు పూర్తిస్థాయిలో సమకూర్చాలని చెప్పారు.

విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించాలి
వల్లాపురంలో రికార్డులు తనిఖీ చేస్తున్న మాణిక్యంనాయుడు :

గుర్ల, జనవరి 28(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో అభ్యసించా లని డీఈవో మాణిక్యంనాయుడు తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపా యాలు పూర్తిస్థాయిలో సమకూర్చాలని చెప్పారు. బుధవారం మండలం లోని మన్యపురిపేట, వల్లాపురం, కెల్ల పాఠశాలలను పరిశీలించారు. బెల్లా నపేట పాఠశాలలో మరుగుదొడ్లు లేవని డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపరిచే విధం గా కృషి చేయాలని సూచించారు. రైజింగ్‌ స్టార్‌ విద్యార్థులను షైనింగ్‌ స్టార్‌ విద్యార్థులుగా తీసుకురావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో భాను ప్రకాష్‌, మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:50 PM