Share News

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:03 PM

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు.

   విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి
మాట్లాడుతున్న రామ్మోహన్‌ :

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. గురువారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యారంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం పెరుగుతోందని, ప్రభుత్వ విద్యాసంస్థలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు అందడంలేదని తెలిపారు. అనంతరం 21 మందితో కమిటీ ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చందు,కార్యదర్శి ఖగేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:03 PM