Share News

శ్రీకాకుళం ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బదిలీ

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:52 PM

జిల్లా ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న బి.రాంబాబు బదిలీ అయ్యారు. ఆయనను విజయ నగరం జిల్లాకు రెగ్యులర్‌ ప్రాతిపదికన బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులు జారీచేసింది.

శ్రీకాకుళం ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ బదిలీ

విజయనగరానికి పంపుతూ ఉత్తర్వులు

శ్రీకాకుళం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఫ్యాక్టరీల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గా విధులు నిర్వర్తిస్తున్న బి.రాంబాబు బదిలీ అయ్యారు. ఆయనను విజయ నగరం జిల్లాకు రెగ్యులర్‌ ప్రాతిపదికన బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులు జారీచేసింది. ఈ మేరకు కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవల శాఖ కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు జీవోఆర్టీ 108ను విడుదల చేశారు. రాష్ట్రం లో ప్రస్తుతం ఉద్యోగుల బదిలీలపై నిషే ధం అమలులో ఉన్నప్పటికీ పరిపాలనా పరమైన కారణాల దృష్ట్యా ఆ బదిలీల నిషేధాన్ని సడలిస్తూ ఈ నిర్ణయం తీసు కున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదే శాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. ఆర్థిక శాఖ ముందస్తు అనుమతితోనే ఈ బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ బదిలీకి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ (ఏపీ)ను ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 03 , 2026 | 11:52 PM