విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:43 PM
విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు.
ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం
ఎచ్చెర్ల, జూలై 2(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. ఎస్ఎంపురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ క్యాంపస్ను గురు వారం సందర్శించారు. విద్యార్థులకు నాణ్య మైన సాంకేతిక విద్యను అందిం చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాం త విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరో హించాలన్న సంకల్పంతోనే ఆర్జీ యూకేటీ క్యాంపస్లను నెలకొల్పారన్నారు. ఇప్పటి వరకు జరిగిన నియామకాల్లో రోస్టర్ పా యింట్లను ఏ మేరకు పాటించారన్న విష యాలను అడిగి తెలుసుకున్నారు. కార్య క్రమంలో క్యాంపస్ డైరెక్టర్ ఎం.గిరిధర్, ఏవో ఎం.శివరామకృష్ణ, డీన్ శాస్త్రి, ఫైనా న్స్ ఆఫీసర్ వాసు, ముని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.