Share News

ప్రతిపాదిత బీచ్‌ రోడ్డు ప్రాజెక్టు స్థల పరిశీలన

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:58 PM

శ్రీకాకుళం నగరం నుంచి పెద్ద గనగళ్లపేట బీచ్‌ వర కు ప్రతిపాదించిన నూతన రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌ జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి గురువారం పరిశీలించారు.

ప్రతిపాదిత బీచ్‌ రోడ్డు ప్రాజెక్టు స్థల పరిశీలన
నూతన రహదారి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

శ్రీకాకుళం అర్బన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరం నుంచి పెద్ద గనగళ్లపేట బీచ్‌ వర కు ప్రతిపాదించిన నూతన రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌ జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి గురువారం పరిశీలించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రా రంభమయ్యే ఈ నూత న బీచ్‌ రోడ్డు మార్గాన్ని వారు సునిశితంగా పరిశీ లించారు. నదికి 50 మీటర్ల భద్రతా దూరాన్ని పాటిస్తూ ఈ మార్గం నిర్మించనున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక సూచనలతో ఈ నూతన రహదారి ప్రాజెక్టు చేపడుతున్నామన్నా రు. కల్లేపల్లి, కునుకుపేట, కిల్లిపాలెం, పీజీపేట గ్రామాల మీదుగా సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు సాగుతుందన్నారు. ఈ మార్గం వెంబడి ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు సైకిల్‌ ట్రాక్‌లు, వాకింగ్‌ స్పేస్‌లు తదితర సదుపాయాలు ఈ ప్రాజెక్టులో పొందుపరుస్తు న్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణంలో భూము లు కోల్పోతున్న రైతులతో గొండు శంకర్‌ స్వయం గా మాట్లాడారు. అభివృద్ధి కోసం భూములు ఇవ్వడానికి రైతులు సముఖత వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 13 , 2026 | 11:59 PM