Share News

కానిస్టేబుల్‌ పరీక్ష శిక్షణకు స్ర్కీనింగ్‌

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:10 AM

రలో జరగబోయే ఏపీ పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షకు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఉచిత శిక్షణ అందించేందుకు ఆది వారం జిల్లాలో స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వ హించారు.

కానిస్టేబుల్‌ పరీక్ష శిక్షణకు స్ర్కీనింగ్‌
స్ర్కీనింగ్‌ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు

‘ఎర్రన్న విద్యా సంకల్పం’లో పరీక్షకు 606 మంది హాజరు

అరసవల్లి/సోంపేట, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగబోయే ఏపీ పోలీసు కానిస్టేబుల్‌ పరీక్షకు ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఉచిత శిక్షణ అందించేందుకు ఆది వారం జిల్లాలో స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వ హించారు. శ్రీకాకుళం నగరం, టెక్కలి, సోంపేటల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 606 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కన బరిచిన వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్‌తో పాటు, 120 రోజుల పాటు శిక్షణ ఇవ్వనన్నట్లు ఎర్రన్న విద్యా సంకల్పం నిర్వాహకులు తెలి పారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభ్యర్థులను అభినందించారు. సోంపేట కార్య క్రమంలో ఎస్‌ఐ మోహిని, కేఆర్‌ కళాశాల కరస్పాండెంట్‌ శేషాద్రి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:10 AM