Share News

పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలి

ABN , Publish Date - May 30 , 2026 | 11:47 PM

w

 పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలి
చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలిస్తున్న స్వప్నిల్‌ దినకర్‌ :

నరసన్నపేట, మే 30(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పంచాయతీలో పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని అధికారులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సూచించారు. శనివారం నరసన్నపేటలోని ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాల నుంచి సంపదను సృష్టించే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరుచేసి, రీసైక్లింగ్‌ చేసే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో స్వరూపరాణి, ఎంపీడీవో వెంకటేష్‌ ప్రసాద్‌, ఈవో ద్రాక్షాయణి పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:47 PM