Share News

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: కలిశెట్టి

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:57 PM

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం: కలిశెట్టి
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎచ్చెర్ల/ఎచ్చెర్ల రూరల్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. కుప్పిలి గ్రామంలో మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లు, చేపట్టిన అభివృద్ధి పను లను ఇంటింటికీ వెళ్లి వివరించారు. ప్రభు త్వం పారదర్శకంగా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తోందన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందన్నారు. కూటమి పార్టీలు ఐక్యత చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేక పోతోందని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి నారాయణ మూర్తి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, పార్టీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, నాయకులు వావిలపల్లి రామకృష్ణ, గాలి వెంకటరెడ్డి, బల్లాడ అరుణా రెడ్డి, మెండ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2026 | 11:57 PM