సమస్యల సాధనకు విజయవాడలో పాదయాత్ర
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:15 AM
సమస్యల పరిష్కారం కోసం మే 15న విజయవాడలో పాదయాత్ర చేపడుతు న్నటు సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, జెఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు.
అరసవల్లి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం మే 15న విజయవాడలో పాదయాత్ర చేపడుతు న్నటు సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, జెఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక బాలభవన్లో జేఏసీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ...ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం టైమ్ స్కేల్, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ వయసు పెంచాలని కోరారు. ఈ సందర్భంగా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ఎల్వీ రమణ, జేఏసీ జిల్లా ఉపాఽధ్యక్షుడు లోకేష్, కార్యదర్శి ఉమా పతి,గోవిందరావు, అప్పారావు, జనార్దరావు, ధనుంజయరావు పాల్గొన్నారు.