Share News

కార్పొరేషన్‌లో విలీనం వద్దు

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:54 PM

కార్పొరేషన్‌లో తోటపాలెం పంచాయతీ విలీనం వద్దని, పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

కార్పొరేషన్‌లో విలీనం వద్దు

తోటపాలెంలో గ్రామస్థుల ర్యాలీ

ఎచ్చెర్ల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌లో తోటపాలెం పంచాయతీ విలీనం వద్దని, పంచాయతీగానే కొనసాగించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం తోటపాలెంలో ర్యాలీ చేపట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలోకి తమ గ్రామాన్ని విలీనం చేయాలన్న ఆలోచన సరికాదన్నారు. విలీన ప్రతిపాదనలతో ఎదురైన ఇబ్బందులపై స్థానికులు చర్చించారు. ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా బలవంతంగా విలీనం చేస్తే ఎన్నికలు బహిష్కరి స్తామని హెచ్చరించారు.

Updated Date - Sep 13 , 2026 | 11:54 PM