ఓటరు జాబితా తప్పుల లేకుండా చర్యలు
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:49 PM
ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలను ఈఆర్వో ఎం.లావణ్య ఆదేశిం చారు.
ఆమదాలవలస, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలను ఈఆర్వో ఎం.లావణ్య ఆదేశిం చారు. శనివారం కృష్ణాపురం, లక్ష్మీనగర్లోని పోలింగ్ కేం ద్రాలను స్పెషల్ క్యాంపె యిన్ డే పురస్కరించుకొని లావణ్య ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తు లను నిబంధనలు ప్రకారం పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరును జాబితాలో నమోదు చేయడంతోపాటు మార్పులు, సవరణలు కోసం సంబంధిత ఫారాలు సమర్పించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.