సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయండి
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:00 AM
ప్రభుత్వ అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు.
పాతపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. శుక్రవారం పాతపట్నంలోని క్యాంపుకార్యాలయంలో టీడీపీక్యాడర్తో సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారంలో భాగస్వామ్యం కావాలన్నారు. పార్టీ ప్రత్యేక పరిశీలకుడు వనమాడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.