నవధాన్యాల సాగుతో భూసారం పెరుగుదల
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:16 AM
ఎల్నినో ప్రభావంతో వేసవి పంటలను ఎదుర్కొనేలా నవధాన్యాల సాగు చేపట్టాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె.రాజగోపాల్ అన్నారు.
పశు సంవర్థకశాఖ జేడీ రాజగోపాల్
ఎచ్చెర్ల, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో వేసవి పంటలను ఎదుర్కొనేలా నవధాన్యాల సాగు చేపట్టాలని జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కె.రాజగోపాల్ అన్నారు. జరజాం గ్రామంలో శనివారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవధాన్యాల సాగులో 9 జాతులు, 30 రకాల విత్తనాలను ఎకరానికి 15 కిలోల చొప్పున వేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. అలాగే పశువుల మేతకు ఉప యోగపడుతుందని, రైతులకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఈ విధానంలో 10 నుంచి 12 మెట్రిక్ టన్నుల పచ్చిరొట్ట వస్తుం దన్నారు. కూరగాయలు, ఆకుకూరలతో లాభదాయక సాగుతో అవ కాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీడీ డాక్టర్ ఎస్.సూర్య నారా యణ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు వీవీ రమణ, జి.సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.