Share News

శిలాఫలకంపై సీఎం, ఎమ్మెల్యే చిత్రాల ధ్వంసం

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:11 AM

హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ)లో కొందరు ఆకతాయిలు దుశ్చర్యకు పాల్ప డ్డారు.

శిలాఫలకంపై సీఎం, ఎమ్మెల్యే చిత్రాల ధ్వంసం
శిలాఫలకంలో సీఎం, ఎమ్మెల్యే ముఖాలు తొలగించిన దృశ్యం

ముఖాలు ఉన్న ప్రాంతాన్ని గీకేసిన ఆకతాయిలు

శ్రీకాకుళం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ)లో కొందరు ఆకతాయిలు దుశ్చర్యకు పాల్ప డ్డారు. శిలాఫలకంపై ఉన్న ముఖ్య మంత్రి చంద్ర బాబు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చిత్రాల్లో ముఖాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పాఠశాల నిర్వాహకులు పట్టించుకోక పోవడం గమనార్హం. ఈ ఘటనపై ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిసింది.

Updated Date - Aug 27 , 2026 | 12:11 AM