ఉత్సవ ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన హెలికాప్టర్ రైడ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:12 AM
అరసవల్లి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడింగ్ మరింత వన్నె తెచ్చిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు.
శ్రీకాకుళం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): అరసవల్లి ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడింగ్ మరింత వన్నె తెచ్చిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ఆదివారం హెలికాప్టర్ రైడింగ్ జరుగుతున్న తీరును ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఏడు రోజుల పాటు శ్రీకాకుళం పరిసర ప్రాంత వాసులను ఈ హెలిటూరిజం కొత్త అనుభూతులను మిగిల్చిందన్నారు విరామం లేకుండా వినోదాన్ని అందించిన పైలెట్లను అభినందించారు. హెలిటూరిజం పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో అడిగి తెలుసుకున్నారు.