ఘనంగా గోదాదేవి కల్యాణమహోత్సవం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:43 PM
పాతపట్నంలోని కల్యాణవేంకటేశ్వ రుని ఆలయంలో గోదాదేవీ శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం మంగళవా రం ఆలయ అర్చకులు శ్రీనివాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు.కళ్యాణమమహోత్సవానికి పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలొచ్చారు. మంగళవారం ఉదయం నుంచే గోదాదేవి ఉత్సవంలో భాగంగాకల్యాణవేంకటేశ్వరుని ఆలయాన్ని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
పాతపట్నం, జనవరి13(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని కల్యాణవేంకటేశ్వ రుని ఆలయంలో గోదాదేవీ శ్రీనివాసుల కల్యాణ మహోత్సవం మంగళవా రం ఆలయ అర్చకులు శ్రీనివాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు.కళ్యాణమమహోత్సవానికి పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలొచ్చారు. మంగళవారం ఉదయం నుంచే గోదాదేవి ఉత్సవంలో భాగంగాకల్యాణవేంకటేశ్వరుని ఆలయాన్ని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు.
నేడు గోదాదేవి కళ్యాణం
నందిగాం/మందస, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పెంటూరు వెంకటేశ్వర ఆలయంలో బుధవారం గోదాదేవి, శ్రీరంగనాఽథుల కళ్యాణం నిర్వహించను న్నట్లు ధర్మకర్తలు బొడ్డ జనార్థనరావు, కృష్ణారావు, అర్చకులు పి.రాజగోపా లాచార్యులు తెలిపారు. నెలరోజుల పాటు నిర్వహించిన ధనుర్మాసోత్సవాలు భోగీతో ముగియనుండడంతో కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. అలాగే సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా గోదాదేవి కల్యాణం జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో గోదాదేవి కల్యాణం నిర్వహించనున్నట్లు అర్చకులు కూర్మాచార్యులు పేర్కొన్నారు.