నిబంధనల మేరకు గ్యాస్ పంపిణీ: డీఎస్వో
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:12 AM
నిబంధనల మేరకు ఎల్పీజీ గ్యాస్ పంపిణీ చేస్తున్నామని జిల్లా సివిల్సప్లయ్శాఖ అధికారి జి.సూర్యప్రకాష్రావు తెలిపారు.
నరసన్నపేట, మార్చి 14(ఆంధ్రజ్యోతి): నిబంధనల మేరకు ఎల్పీజీ గ్యాస్ పంపిణీ చేస్తున్నామని జిల్లా సివిల్సప్లయ్శాఖ అధికారి జి.సూర్యప్రకాష్రావు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే ఏజెన్సీలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం నరసన్నపేటలో హాటళ్లు, దాబాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హాటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసులు నమోదుచేసి ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వసతిగృహాలను పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగించవద్దని, వసతిగృహాలకు పంపిణీ చేసే గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని కోరారు. కార్యక్రమంలో సీఎస్డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.