పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి: డీపీవో
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:40 PM
: వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో సకాలంలో పారిశుధ్య పనులు నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) స్వరూపారాణి కోరారు.
సరుబుజ్జిలి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం దృష్ట్యా గ్రామాల్లో సకాలంలో పారిశుధ్య పనులు నిర్వహించి పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) స్వరూపారాణి కోరారు. శుక్రవారం మండలంలోని షలంత్రిలో డ్రైడే ఫ్రైడే కార్య క్రమంలో భాగంగా చెత్త సంపద తయా రీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారా యణ, ఎంపీడీవో పావని, ఈవోపీఆర్డీ రామారావు పాల్గొన్నారు.