గూడ్స్ రైలులో మంటలు
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:37 AM
పూండి రైల్వే స్టేషన్లో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి.
వజ్రపుకొత్తూరు, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పూండి రైల్వే స్టేషన్లో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు వ్యాపించాయి. తాల్చేరు నుంచి విశాఖ వెళ్తున్న ఈ బొగ్గు రైలు నుంచి మంటలు రావడాన్ని పూండి రైల్వేస్టేషన్ వద్ద గుర్తించిన రైల్వే అధికా రులు.. కాశీబుగ్గ అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకొని మంటల ను అదుపు చేశారు. ఎండతీ వ్రతతో పాటు రాపిడి కారణంగా మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.