Share News

ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలి

ABN , Publish Date - May 18 , 2026 | 11:25 PM

ప్లాస్టిక్‌ రహిత సామాజంకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం స్థానిక ఆలాంధ్రరోడ్‌లోని చెత్త నుంచి సందప తయారీకేంద్రంలో ఘనవ్యర్ధాల నిర్వహణా కేంద్రాన్ని ప్రారంభించారు.

 ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలి
ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు :

పాతపట్నం, మే 18(ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ రహిత సామాజంకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. సోమవారం స్థానిక ఆలాంధ్రరోడ్‌లోని చెత్త నుంచి సందప తయారీకేంద్రంలో ఘనవ్యర్ధాల నిర్వహణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వ్యర్థాల రీసైక్లింగ్‌తో పంచాయతీలకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. పర్యావరణానికి ముప్పుగామారిన ప్లాస్టిక్‌ వ్యర్థాల నివారణకై ప్రభుత్వం ముందుడుగు వేసిందన్నారు. ఇందులో భాగంగా శాస్త్రీయ పద్ధతిలో ఈ ఆధునిక యంత్రాలను వినియోగించి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సులభతరంగా వేరుచేసి రీసైక్లింగ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు పంచాయతీలకు అదనపు ఆదాయం లభించనుందన్నారు.నియోజకవర్గాన్ని పచ్చదనం- పరిశుభ్రతకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచేలా ప్రజా భాగస్వామ్యంతో పనిచేసేందుకు నాయకులు, అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నందిగామ ప్రసాదరావు, ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి టీడీపీ నేతలు పైల బాబ్జీ, సైలాడ సతీష్‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. :

Updated Date - May 18 , 2026 | 11:25 PM