పర్యావరణ పరిరక్షణకు కృషి: శంకర్
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:30 PM
పర్యావరణ పరిర క్షణతో పాటు పరి శుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయా లని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
గార, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిర క్షణతో పాటు పరి శుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయా లని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సతివాడ గ్రామంలో శనివారం ‘స్వర్ణాం ధ్ర-స్వచ్ఛాంధ్ర’ నిర్వహించారు. గ్రామంలో కొబ్బరి మొక్కలను నాటారు. అనంతరం చీపురుపట్టి శుభ్రం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. ప్రభుత్వం అందించిన పాఠ్యపుస్త కాలు, యూనిఫారాలు, బ్యాగ్లను పంపిణీ చేశారు. మండల స్థాయి అధికారులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.