Share News

పాఠశాలలో.. మద్యం మత్తులో

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:22 AM

Marriguda Ashram School Employee.. Drunk at school హిరమండలం మండలం మర్రిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఓ ఉద్యోగి ఆదివారం మద్యం మత్తులో అక్కడే నిద్రించాడు. ఎవరు లేపినా.. లేవనంతగా మత్తులో మునిగిపోయాడు.

పాఠశాలలో.. మద్యం మత్తులో
మర్రిగూడ ఆశ్రమ పాఠశాలలో మద్యంతాగి పడుకున్న ఉద్యోగి (ఇన్‌సెట్‌లో మద్యం సీసా)

మర్రిగూడ ఆశ్రమ పాఠశాల ఉద్యోగి నిర్వాకం

హిరమండలం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): హిరమండలం మండలం మర్రిగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఓ ఉద్యోగి ఆదివారం మద్యం మత్తులో అక్కడే నిద్రించాడు. ఎవరు లేపినా.. లేవనంతగా మత్తులో మునిగిపోయాడు. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ ఆరా తీయగా.. ప్రతిరోజూ పాఠశాలకు మద్యం తీసుకువచ్చి తాగి పడుకుంటాడని కొంతమంది విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు భాస్కరరావు వద్ద ప్రస్తావించగా.. ఆ ఉద్యోగికి చాలాసార్లు పాఠశాలలో మద్యం తాగొద్దని చెప్పామన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఆశ్రమ పాఠశాలలో 3వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు 88 మంది ఉండేవారు. పదోతరగతి పరీక్షలు పూర్తికావడంతో ప్రస్తుతం 81 మంది విద్యార్థులు ఉంటున్నారు. కాగా పాఠశాలలో పర్యవేక్షణ కరువై విద్యార్థులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారు. ఈక్రమంలో ఈ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఈ ఏడాది నుంచి ఏడో తరగతి వరకే ఈ పాఠశాలను పరిమితం చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Updated Date - Apr 06 , 2026 | 12:22 AM