పోర్టు పునరావాస కాలనీకి తాగునీరు
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:40 AM
మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పున రావాస కాలనీకి రూ.90 లక్షలతో తా గునీరు అందిస్తున్న ట్టు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు.
టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి
సంతబొమ్మాళి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు పున రావాస కాలనీకి రూ.90 లక్షలతో తా గునీరు అందిస్తున్న ట్టు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి అన్నారు. గురువారం నౌపడలోని పోర్టు పునరవాస కాలనీలో రక్షిత నీటి సరఫ రాకు శంకుస్థాపన చేశారు. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ నుంచి పున రావస కాలనీకి పైప్లైన్ ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంతో తహసీల్దార్ బి.హేమసుందరావు, టీడీపీ నాయకులు రెడ్డి అప్పన్న, జీరు భీమారావు, అట్టాడ రాంప్రసాద్, కర్రి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.