మాదక ద్రవ్యాల బారిన పడొద్దు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:25 PM
స్వామి వివేకనంద జీవితాన్ని యువత మా ర్గదర్శకంగా తీసుకోవాలని స్థానిక జూనియర్ సివిల్కోర్టు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్. వాణి తెలిపారు. గురువారం స్థానిక జూనియర్ ప్రభుత్వ కళాశాలలో స్వామి వివే కానంద జయంతి వారోత్సవాలు పురస్కరిం చుకుని విద్యార్థులకు మత్తుపదార్థాలపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.
కోటబొమ్మాళి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): స్వామి వివేకనంద జీవితాన్ని యువత మా ర్గదర్శకంగా తీసుకోవాలని స్థానిక జూనియర్ సివిల్కోర్టు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్. వాణి తెలిపారు. గురువారం స్థానిక జూనియర్ ప్రభుత్వ కళాశాలలో స్వామి వివే కానంద జయంతి వారోత్సవాలు పురస్కరిం చుకుని విద్యార్థులకు మత్తుపదార్థాలపై న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు వ్యస నాలు, మత్తుపదార్థాల మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడా లని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వెలమల అప్పలనాయు డు, జూనియర్ కళాశాల ప్రిన్పిపాల్ ఎ.అప్పారావు పాల్గొన్నారు.