రగ్బీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:50 PM
కర్నూలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా పురుషుల, మహిళల జట్లను ఆదివారం ఎంపిక చేశారు.
టెక్కలి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా పురుషుల, మహిళల జట్లను ఆదివారం ఎంపిక చేశారు. ఈ ఎంపిక పోటీలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. 12 మంది పురుషులు, 12మంది మహిళలను ఎంపిక చేసినట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాడాన నారాయణరావు తెలిపారు.