అర్హతే ప్రాతిపదికగా సహకారం
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:16 PM
అర్హతే ప్రాతిపదికగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): అర్హతే ప్రాతిపదికగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాల యంలో ముగ్గురు బాధితులకు రూ.2,35,819 మొత్తానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం అందజేశారు. అనారోగ్యంతో బాధ పడుతున్న కొత్తూరు మండలం దిమిలి గ్రామానికి చెందిన సాగర్బాబుకు రూ.1,04,157, మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన ముంగి నారాయణకు రూ.95,012, భరణికోటకు చెందిన పాలవలస ఈశ్వరరావుకు రూ.36,650 చెక్కులను అందజేశారు.