అభాగ్యులకు సీఎంఆర్ఎఫ్ ఆసరా
ABN , Publish Date - Sep 13 , 2026 | 11:40 PM
అభాగ్యులకు సీఎం సహాయనిధి ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం పోలాకి మండలంలోని కత్తిరివానిపేటలోగల క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట మండలంలోని ఉర్లాం గ్రామానికి చెందిన నడిమిండి దుర్గారావుకు సీఎం సహాయక నిధి కింద రూ.1,17,700 చెక్కును పంపిణీ చేశారు.
నరసన్నపేట, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): అభాగ్యులకు సీఎం సహాయనిధి ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. ఆదివారం పోలాకి మండలంలోని కత్తిరివానిపేటలోగల క్యాంపు కార్యాలయంలో నరసన్నపేట మండలంలోని ఉర్లాం గ్రామానికి చెందిన నడిమిండి దుర్గారావుకు సీఎం సహాయక నిధి కింద రూ.1,17,700 చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జల్లు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.