Share News

యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:12 AM

మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని వేధిస్తున్న కేసులో కాశీబుగ్గకు చెందిన బలగ మన్మథరావు అలియాస్‌ సుమిత్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బి.నిహార్‌ మంగళవారం తెలిపారు.

యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని వేధిస్తున్న కేసులో కాశీబుగ్గకు చెందిన బలగ మన్మథరావు అలియాస్‌ సుమిత్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బి.నిహార్‌ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మన్మథరావు కాశీబుగ్గలో కంప్యూట ర్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అయితే డిగ్రీ పూర్తి చేసిన మండలానికి చెందిన ఓ యువతి ఈ కోచింగ్‌ సెంటర్‌లో చేరింది. ఈ క్రమంలో ఆ యువతిని మన్మఽథరావు పెళ్లి చేసుకుంటానని కొన్నాళ్లగా వేధించడం మొదలుపెట్టాడు. దీం తో ఆమె వజ్రపుకొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతిరావు విచారణ చేపట్టి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

ఇద్దరిపై కేసు నమోదు

పాతపట్నం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): కాగువాడ గ్రామానికి చెందిన కర్ర నాగమణి(40) ఆత్మహత్య కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.మధుసూదనరావు మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కాగువాడ గ్రామం సోమప్ప కాలనీకి చెందిన కర్ర నాగమణి తన భర్త కర్ర ఈశ్వరరావుతో కలిసి జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో నిద్రి స్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఆనెం రవి వారింట్లో చొరబడ్డాడు. ఇదే సమయంలో ఈశ్వరరావు లేవడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొ దలయ్యాయి. దీంతో ప్రతి రోజూ నాగమణిని అనుమానిస్తూ ఈశ్వరరావు వేధిం చడం మొదలుపెట్టాడు. విసిగిపోయిన నాగమణి ఈనెల 20న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 21న మృతి చెందింది. దీంతో నాగామణి తల్లి పులి పాపమ్మ ఫిర్యాదు మేరకు ఈశ్వరరావు, రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

చోరీ కేసుల్లో నిందితుడికి జైలు

శ్రీకాకుళం రూరల్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): శాస్త్రులపేటలోని సంస్కార్‌ పాఠశాల, మహాలక్ష్మీనగర్‌ లో నిర్మాణంలో ఉన్న ఇళ్లల్లో ఎలక్ట్రిక్‌ వైర్లు చోరీ కేసుల్లో పెద్దపాడు గ్రామానికి చెందిన కలగ రాముకి శ్రీకాకుళం మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌కోర్టు న్యాయాధికారి కేఎంజే బేగం జైలుశిక్ష విధించినట్టు రూరల్‌ ఎస్‌ఐ రాము తెలిపారు. ఈ రెండు వేర్వేరు కేసుల్లో ఒక్కో కేసులో ఒక ఏడాది సాధారణ జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా వేర్వేరుగా విధించారన్నారు. జరిమానా చెల్లించకుంటే ఒక్కో కేసులో వేర్వేరుగా అదనంగా మరో రెండు నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చారన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:12 AM