ఆటో-బైక్ ఢీ.. ఆరుగురికి గాయాలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:26 AM
తలగాం జంక్షన్ వద్ద సో మవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకున్నాయి.
టెక్కలి/రూరల్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): తలగాం జంక్షన్ వద్ద సో మవారం ఆటో, ద్విచక్ర వాహనం ఢీకున్నాయి. ఈ ఘటనలో ఆటో బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నౌపడాకు చెందిన పి.కల్యాణి, కె.అప్పారావు, భావనపాడుకు చెందిన ఎన్.రాజేశ్వరి, ఎరకన్నపేటకు చెందిన సీహెచ్ గవిరేసు, ఐ.లచ్చోడు, పాతనౌపడకు చెందిన బి.జయరాం గాయపడ్డారు. వీరికి జిల్లా కేంద్రాసుపత్రిలో వైద్యులు చికిత్సలు అందించారు. టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.