రేపు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ముత్యాల ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:45 PM
Muggulu comptation సంక్రాంతిని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఏటా మాదిరి ఈ ఏడాదీ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించ నుంది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనుంది.
సంక్రాంతి నేపథ్యంలో నిర్వహణకు ఏర్పాట్లు
భారీగా నగదు పురస్కారాలు
వేదిక : శ్రీకాకుళం ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ గ్రౌండ్
సమయం : శనివారం ఉదయం 10 గంటల నుంచి..
శ్రీకాకుళం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): సంక్రాంతిని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్’ ఏటా మాదిరి ఈ ఏడాదీ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించ నుంది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనుంది. ఈ సారి ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్’ నిర్వహి స్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. (పవర్డ్ బై : సన్ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్ వాసి అగరబత్తీ) ఈ నెల 3న జరగనున్నాయి. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల జంక్షన్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ముగ్గుల పోటీలు శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలతో ముగుస్తాయి. ముగ్గుల పోటీ లను న్యాయనిర్ణేతల పర్యవేక్షించి విజేత లను ఎంపిక చేస్తారు. ఆకర్షణీయమైన మూడు ముగ్గులను ఎంపిక చేసి విజేత లకు బహుమతులతోపాటు నగదు పుర స్కారాన్ని అందజేస్తారు. ప్రథమ విజేత కు రూ.6వేలు, ద్వితీయ విజేతకు రూ.4 వేలు, తృతీయ విజేతకు రూ.3వేలు నగ దుతోపాటు మెమొంటోలను అందజే స్తారు. ఇందులో పాల్గొన్నవారికి కన్సొలేష న్ బహుమతులు కూడా ఉంటాయి.
శ్రీకాకుళంలో జరిగే జిల్లాస్థాయి ముగ్గుల పోటీలకు స్పాన్సర్గా మీనాక్షి హాస్పెటల్ ప్రముఖ సర్జికల్ గ్రాస్ట్రో ఎం ట్రాలజిస్ట్, లేపరోస్కోపిక్ సర్జన్ డా.గంగాధర్రావు గొండు, స్త్రీ ప్రసూతి వైద్యనిపుణులు, లేపరోస్కోపిక్ సర్జన్ డా.సీహెచ్ హరిత వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో భారీగా నగదు బహుమతులను గెలుచుకోవచ్చు. శ్రీకాకుళంలోని ముగ్గుల పోటీల్లో గెలుపొందినవారిలో ప్రథమ విజేత.. ఈనెల 10న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. జిల్లాకు చెందిన మహిళలు.. ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని అందమైన ముగ్గులు వేసి ఆకర్షణీయమైన బహుమతులను గెలుచుకోవాలని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ పిలుపునిస్తోంది. ఆసక్తి గలవారు.. 9985411526 నెంబర్కు సంప్రదించి పేర్లును రిజిస్ర్టేషన్ చేసుకోవాలి.
ఇవీ నిబంధనలు..
ముగ్గుల పోటీల్లో మహిళలు మాత్రమే పాల్గొనాలి. పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. కేవలం చుక్కల ముగ్గులను మాత్రమే వేయాలి. ముగ్గు వేయడానికి గరిష్ట సమయం రెండు గంటలు మాత్రమే. అలాగే ముగ్గు వద్దకు న్యాయనిర్ణేతలు వచ్చేటప్పుడు ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలో చెప్పగలిగి ఉండాలి. ముగ్గు చేతితోనే వేయాలి. గొట్టాలు, బద్దలు వంటివి ఉపయోగించకూడదు. జల్లెడ ఉపయోగించుకోవచ్చు. ముగ్గుల్లో గొబ్బెమ్మలను, బతుకమ్మలను అమర్చుకోవచ్చు.. కానీ ఇతరత్రా వస్తువులను అదనపు ఆకర్షణ కోసం వాడకూడదు.