Share News

స్వాగత ద్వారాన్ని బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:56 AM

అరసవల్లి సమీపంలోని అసిరితల్లి అమ్మవారు ఆలయం వద్ద రథసప్తమి పురస్కరించుకుని తాత్కా లికంగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి ద్విచక్రవాహనం ఢీకొని ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు.

స్వాగత ద్వారాన్ని బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

శ్రీకాకుళం రూరల్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సమీపంలోని అసిరితల్లి అమ్మవారు ఆలయం వద్ద రథసప్తమి పురస్కరించుకుని తాత్కా లికంగా ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి ద్విచక్రవాహనం ఢీకొని ఆదివారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. అరసవల్లి ఆదిత్య నగర కాలనీకి చెందిన కోట తవుడు(55) వప్పంగి నుంచి శ్రీకాకుళం వైపు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ రహదారిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్వాగత ద్వారాన్ని ఢీకొనడంతో వాహన చోదకుడు తవుడు మృతి చెందగా వెనుక కూర్చొన్న ప్రసాద్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. తవుడు కుమారుడు కోట సంతోష్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్‌ ఏఎస్‌ఐ భుజంగరావు కేసు నమోదు చేశారు.

Updated Date - Jan 13 , 2026 | 12:56 AM