టీడీపీలో 70 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:50 PM
కంచిలి మండలంలోని కుంబరి నౌగాం గ్రామానికి చెందిన 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రామయ్యపుట్టుగలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
కవిటి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): కంచిలి మండలంలోని కుంబరి నౌగాం గ్రామానికి చెందిన 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రామయ్యపుట్టుగలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ మేరకు సీపీఎంకు చెందిన వారంతా టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో కంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.రామారావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్వీ రమణ, మాజీ సర్పంచ్ పండా, కిషోర్ పాడి, ఎం.ఆనంద్లు పాల్గొన్నారు.