Share News

10.5 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:49 PM

గంజాయిని తరలి స్తున్న ఇద్దరు మహిళలను శ్రీకాకుళం నగరం సమీపంలో ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌ పరిధి లోని కుశాలపురం సింహద్వా రం వద్ద అరెస్ట్‌ చేసినట్లు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతా రం తెలిపారు.

10.5 కిలోల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ అవతారం

- ఇద్దరు మహిళల అరెస్టు

ఎచ్చెర్ల, మార్చి 7(ఆంధ్ర జ్యోతి): గంజాయిని తరలి స్తున్న ఇద్దరు మహిళలను శ్రీకాకుళం నగరం సమీపంలో ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌ పరిధి లోని కుశాలపురం సింహద్వా రం వద్ద అరెస్ట్‌ చేసినట్లు జేఆర్‌ పురం సీఐ ఎం.అవతా రం తెలిపారు. ఈ మేరకు శనివారం ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఒడిశాకు చెం దిన కె.ప్రియాంకరాణి, ప్రధాన్‌ మహిళలు తమ బ్యాగుల్లో గంజాయిని పెట్టుకుని బెంగళూరు తరలించేందుకు సింహద్వారం వద్ద బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ మేరకు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగా వారిని చూసిన సదరు మహిళు పారిపోచే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని పట్టుకుని బ్యాగులను తనిఖీ చేశారు. ఆ బ్యాగుల్లో 8 ప్యాకెట్లలో 10.5 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని బెంగుళూర్‌కు తీసుకువెళ్లి అక్కడ అప్పగిస్తే రూ.10 వేలు వంతున ఇస్తారని వారు పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:49 PM