Share News

విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం

ABN , Publish Date - Mar 04 , 2026 | 06:20 AM

విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధమవడంతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాపిక్‌ నిలిచిపోయింది.

విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం

  • టైరు పేలి..కొద్ది క్షణాలకే చెలరేగిన మంటలు

  • ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం

సాగర్‌నగర్‌(విశాఖపట్నం), మార్చి 3(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-భీమిలి బీచ్‌రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధమవడంతో కొద్దిసేపు ఆ మార్గంలో ట్రాపిక్‌ నిలిచిపోయింది. ఓంకార్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంగళవారం ఉదయం విశాఖ నగరంలోని గవర్నర్‌ బంగ్లా నుంచి భీమిలిలోని ప్రైవేటు పాఠశాలకు బయలుదేరింది. సుమా రు 8.30 గంటలకు పెదరుషికొండ జంక్షన్‌ వద్ద పెద్ద శబ్దంతో బస్సు టైరు పేలింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే బస్సులో మంటలు చెలరేగి దగ్ధమైంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్‌ రాజేశ్‌ తెలిపారు. టైర్‌ పేలడం, ఆ వెంటనే మంటలు వ్యాపించడంతో బస్సును రోడ్డు పక్కకుతీసి, తాను కిందికి దూకేశానని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అప్పటికే బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆరిలోవ సీఐ బాలకృష్ణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సులో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు టూర్‌కు వెళ్లాల్సి ఉందని, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు.

Updated Date - Mar 04 , 2026 | 06:25 AM