భర్త చనిపోయిన 40 రోజులకే వితంతు పెన్షన్
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:17 PM
భర్త చనిపోయిన 40 రోజుల వ్యవధిలోనే పెన్షన్ అందజేసి ఆ కుంటుంబానికి బాసటగా ప్ర జా ప్రభుత్వం నిలిచిందని ము స్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ షంషుద్దీన్ చెప్పారు.
పర్చూరు, జూలై1(ఆంధ్రజ్యోతి) : భర్త చనిపోయిన 40 రోజుల వ్యవధిలోనే పెన్షన్ అందజేసి ఆ కుంటుంబానికి బాసటగా ప్ర జా ప్రభుత్వం నిలిచిందని ము స్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ షేక్ షంషుద్దీన్ చెప్పారు. బుధవారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా పర్చూరు గ్రామానికి చెందిన మరో ముగ్గురు డయాలసిస్ పేషెంట్లకు రూ.10వేల చొప్పున ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు. ఈకార్యక్రమంలో పర్చూరు పార్టీ టీడీపీ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.