పప్పు, పచ్చడితోనే సరిపెడుతున్నారు!
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:01 AM
మెనూ అమలు కావడం లేదని, ప్రతిరోజు ప చ్చడి, పప్పుతోనే సరిపెడుతున్నారని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం వి ద్యార్థులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎ దుట వాపోయారు.
మెనూ అసలు పట్టించుకోవటం లేదు
ఎమ్మెల్యే ఇంటూరి వద్ద విద్యార్థినుల ఆవేదన
కందుకూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మెనూ అమలు కావడం లేదని, ప్రతిరోజు ప చ్చడి, పప్పుతోనే సరిపెడుతున్నారని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహం వి ద్యార్థులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎ దుట వాపోయారు. కందుకూరులోని టీఆర్ఆ ర్ ప్రభుత్వ కళాశాలల ఆవరణలోని బాలికల వసతిగృహాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆకస్మికం గా తనిఖీచేశారు. ఆ సమయంలో హాస్టల్ వా ర్డెన్లు ఇద్దరూ అందుబాటులో లేరు. దీంతో నేరుగా వంటగదిలోకి వెళ్లిన ఎమ్మెల్యే భోజనం కోసం తయారుచేస్తున్న పదార్థాలను పరిశీలిం చారు. ఈ హాస్టల్లో టీఆర్ఆర్ ప్రభుత్వ జూ నియర్, డిగ్రీ కళాశాలలతో పాటు నర్సింగ్ వి ద్యార్థులతో కలిపి 200మందికి పైగా ఉంటు న్నారు. వారికి సరిపడా ఆహారం తయారుచే యటం లేదని గమనించి ఎమ్మెల్యే తీవ్ర ఆ గ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విద్యా ర్థునులు మాట్లాడుతూ మెనూ అమలుచేయ డం లేదన్నారు. ప్రతిరోజు పప్పు, పచ్చడితోనే సరిపెడుతున్నారన్నారు. సాయంత్రం స్నాక్స్ ఇ వ్వడం పూర్తిగా మానేశారని ఎమ్మెల్యేకు ఫిర్యా దు చేశారు. తగినన్ని బెడ్లు కూడా లేక పోవటంతో నేలపైనే పడుకుంటున్నామని ఆ యన దృష్టికి తెచ్చారు. ఈలోగా వార్డెన్లు ఇ ద్దరు హాస్టల్కు చేరుకున్నారు. దీంతో వారిపై ఎమ్మెల్యే నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పట్టికను రాసి అమలుచేయా లని ఆ పట్టికలో తన ఫోన్ నెంబరు కూడా రాయించాలని సూచించారు. విద్యార్థినులు ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేసి నేరుగా హా స్టల్కు వచ్చి తగు చర్యలు తీసుకుంటానన్నా రు. ఇది మొదటి హెచ్చరికగా తీసుకుంటున్నా మన్నారు. ఆయన వెంట దామా మల్లేశ్వరరా వు, షేక్ రఫీ, నల్లూరు సూర్యనారాయణరావు తదితరులు ఉన్నారు.