బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:21 AM
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు హెచ్చరించారు. అందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు.
యాప్లపై ప్రత్యేక నిఘా
ఎస్పీ హర్షవర్ధన్రాజు
ఒంగోలు క్రైం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వి.హర్షవర్ధన్రాజు హెచ్చరించారు. అందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభమైనందున బెట్టింగ్ యాప్లపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువత ఆత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా బెట్టింగ్లు వేస్తుంటే డయల్ 112కు, 91211 02266 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.