Share News

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా కృష్ణయ్య

ABN , Publish Date - May 13 , 2026 | 03:07 AM

ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా టి.వెంకటకృష్ణయ్య నియమితులయ్యారు. ఈమేరకు పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా కృష్ణయ్య

పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఒంగోలు కార్పొరేషన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా టి.వెంకటకృష్ణయ్య నియమితులయ్యారు. ఈమేరకు పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పల్నాడు జిల్లా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పూడా- నరసరా వుపేట) సెక్రటరీగా ఉన్న కృష్ణయ్యకు ఒంగోలు కార్పొరేషన్‌ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో కమిషనర్‌గా ఉన్న కోడూరు వెంకటేశ్వరరావు నెలరోజులపాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత అసిస్టెంట్‌ కమిషనర్‌ టి.రాంభూపాల్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. వెంకటేశ్వరరావు సెలవు గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో ఆయన బుధవారం బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో వెంకటకృష్ణయ్యను కమిషనర్‌గా నియమించారు. రెండు రోజులలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

Updated Date - May 13 , 2026 | 03:07 AM