50మంది కార్యదర్శులకు ఉద్యోగోన్నతులు
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:50 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 50 మంది గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు.
పత్రాలు అందజేసిన డీపీవో వెంకటేశ్వరరావు
ఒంగోలు కలెక్టరేట్, పిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న 50 మంది గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5గా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీచేశారు. గ్రేడ్-6లో 55మందికి ఉద్యోగో న్నతి పొందేందుకు అర్హత ఉండగా వారిలో ఒకరు రాజీనామా చేశారు. మరో నలుగురు వివిధ కారణాలతో ఉద్యోగోన్నతులు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో 50మందికి మాత్రమే ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి డీపీవో వెంకటేశ్వరరావు శుక్రవారం ఉత్తర్వులను అందజేశారు.