Share News

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తాం

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:43 PM

: ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు.

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తాం
జెండా ఊపి కలశ యాత్రను ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ టీజీ

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌

కర్నూలు కల్చరల్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అన్నారు. శనివారం పాత నగరంలోని రాంభొట్ల దేవాలయం నుంచి పూల బజార్‌లోని చిన్న అమ్మవారిశాల వరకు తలపెట్టిన కలశ యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాము ముందు ఉంటామని తెలిపారు. లలితా పీఠం పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్యంస్వామి, సాయిబాబా, నాగ వీరాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 11:43 PM