సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:41 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 98 సమస్యలు
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.