నిలిచిన నీటి ప్రవాహం
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:05 AM
తెలుగుగంగ ప్రధాన కాల్వలో నీరు నిలిపిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగునీటి కోసం రైతుల ఆందోళన
రుద్రవరం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలుగుగంగ ప్రధాన కాల్వలో నీరు నిలిపిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న వేరుశెనగ, వరి, మినుము, తదితర పంటలను వేలాది ఎకరాల్లో సాగు చేశారు. నీటి ప్రవాహం నిలిచిపోవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని, అధికారులు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.