ఉపాధి పనులను వినియోగించుకోండి: ఎమ్మెల్యే దస్తగిరి
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:12 AM
ఉపాధి హామీ పను లను వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కర్నూలు రూరల్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పను లను వినియోగించుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో శనివారం ఉపాధి కూలీలతో కలిసి స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కోడుమూరు ఎమ్మెల్యే పాల్గొని కూలీలతో పాటు పూడికను తొలగిస్తూ, శ్రమదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిని నిల్వ ఉంచడం, భవిష్యత్ తరాలకు గొప్ప వరమన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు సీతారామిరెడ్డి, మిలటరికాలనీ అభిలాష్ పాల్గొన్నారు.