Share News

‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’

ABN , Publish Date - Jun 12 , 2026 | 01:18 AM

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్తులో ముడిపడిన నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (డీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు.

‘కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి’
ఆందోళన చేస్తున్న డీఎస్‌ఎఫ్‌ నాయకులు

ఆదోని అగ్రిలక్చర్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్తులో ముడిపడిన నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ (డీఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు డిమాండ్‌ చేశారు. గురువారం డీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పట్టణం లోని ఎమ్మిగనూరు సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. నాయకులు అనిల్‌, వర్మ, కిరణ్‌, రాజు అరవిందు, వీరేంద్ర, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2026 | 01:18 AM