స్పెషల్ క్యాంపెయిన డేకు విశేష స్పందన
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:05 AM
నియోజకవర్గ పరిధి లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన డేకు విశేష స్పందన లభించిందని కర్నూలు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబు లేసు అన్నారు.
కర్నూలు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధి లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన డేకు విశేష స్పందన లభించిందని కర్నూలు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబు లేసు అన్నారు. ఆదివారం సి.క్యాంపు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, సిల్వర్ జుబ్లీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈఆర్వో మాట్లాడుతూ అవసరమైన సమయం అందించేందుకు ఫారం-6, 6ఏ, 7, 8ల స్వీకరణకు నిర్వహించిన ప్రత్యేక ప్రచార దినాలకు విశేష స్పందన లభించిందన్నారు. మే 19 నుంచి ఆగస్టు 29 వరకు నియోజక వర్గంలో మొత్తం 10,608 దరఖాస్తులు అందినట్లు ఆయన తెలిపారు. ఇందులో నమూనా-6 ద్వారా 4653, 6ఏ ద్వారా 108, నమూనా 7 ద్వారా 94, నమూనా 8 ద్వారా 5775 దరాఖాస్తులు స్వీకరించామన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 2434 మందికి నోటీసులు జారీచేశామని, విచారణ నిర్వహించి, అభ్యర్థనలు, అభ్యంతరాలను బీఎల్ వోలు స్వీకరించాల న్నారు. నిర్ధేశిత గడువు లోపు ఈ ప్రక్రియను పూర్తిచేసి అనంతరం తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 3న ప్రచురించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.