Share News

స్థూల దేశీయోత్పత్తి వృద్ధ్దే లక్ష్యం

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:24 PM

జిల్లా స్థూల దేశీయోత్పత్తి(డీడీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ప్లాన్‌ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

స్థూల దేశీయోత్పత్తి వృద్ధ్దే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థూల దేశీయోత్పత్తి(డీడీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ప్లాన్‌ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్‌ ప్లాన్‌ యూనిట్‌లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, పీ-4 కార్యక్రమం, జిల్లా ప్రగతి సూచికలపై ఆమె విజన్‌ ప్లాన్‌ యూనిట్‌ సిబ్బందితో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో జిల్లా విజన్‌ ప్లాన్‌ యూనిట్‌ను, ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక విజన్‌ ప్లాన్‌ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ యూనిట్లలో విధులు నిర్వహించేందుకు యువ నిపుణు లను నియమించామని, వీరు వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మండలాల స్థాయిలో ప్రగతికి తోడ్పడుతున్నారన్నారు. ప్రతి విభాగంలో కనీసం 15 శాతం పురోగతిని సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 11:24 PM