Share News

సీమ డిక్లరేషనపై బీజేపీ సమాధానం చెప్పాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:29 AM

రాయలసీమ డిక్లరేషన్‌ పై బీజేపీ వైఖరీ ఏమీటి...? ప్రజలకు సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు.

సీమ డిక్లరేషనపై బీజేపీ సమాధానం చెప్పాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు

డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు

కర్నూలు అర్బన్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాయలసీమ డిక్లరేషన్‌ పై బీజేపీ వైఖరీ ఏమీటి...? ప్రజలకు సమాధానం చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు బి. క్రాంతినాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ డిక్లరేషన్‌ పై మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డిల వైఖరీ ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇస్తాందా అని ప్రశ్నించారు. కోడుమూరు నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ అనంతర్నం మాదిగ, బజారన్న, షేక్‌ ఖాజా హుస్సేన్‌ , ఈ లాజరస్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 12:29 AM