Share News

కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:56 PM

విజయవాడలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స మగ్ర ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా విశేష సేవలు అందించినందుకు నంద్యాల కలెక్టర్‌ రాజకుమారికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది.

కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు
అవార్డు అందుకుంటున్న కలెక్టర్‌ రాజకుమారి

ప్రశంసలు, నగదు పురస్కారం ప్రదానం

నంద్యాల నూనెపల్లి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : విజయవాడలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స మగ్ర ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా విశేష సేవలు అందించినందుకు నంద్యాల కలెక్టర్‌ రాజకుమారికి రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను ప్రశంసిస్తూ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ కలెక్టర్‌కు ప్రశంసాపత్రం, జ్ఞాపికతో పాటు రూ.20 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ గుర్తింపు జిల్లా పరిపాలనకు గర్వకారణమన్నారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 26న కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నటుకలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Jan 25 , 2026 | 11:56 PM